ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,పెన్షనర్లకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తోంది.

రామగిరి, ఏప్రిల్ 16: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,పెన్షనర్లకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తోంది. దీన్ని నిరసిస్తూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లోని కార్యాలయ వద్ద ధర్నాలు, మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు చేస్తున్నట్లు టీజీఈజేఏసీ కార్యదర్శి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, టీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి పిలుపునిచ్చారు.
