యాసంగిలో పండిన వడ్లను పూర్తిస్థాయిలో కొనకుండా.. వానకాలం సీజన్లో విత్తనాలు ఇవ్వకుండా కాంగ్రెస్ సరారు రైతులపై కుట్ర చేస్తున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు.

తిమ్మాపూర్, జూన్ 12 : యాసంగిలో పండిన వడ్లను పూర్తిస్థాయిలో కొనకుండా.. వానకాలం సీజన్లో విత్తనాలు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారు రైతులపై కుట్ర చేస్తున్నదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. మరో సీజన్లో వరి వేయాలంటే భయపడేలా చేస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నారని, సాగు పండుగలా సాగిందని గుర్తు చేశారు. ఈ నెల 16న బీఆర్ఎస్ మానకొండూర్ నియోజకవర్గ విసృ్తత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి హాజరవుతారని చెప్పారు. కార్యకరలు నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. తిమ్మాపూర్లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
