కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు.

భీమదేవరపల్లి, జనవరి 13: కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం వీరభద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. కోరిన కోరికలు తీర్చాలని కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతితో ముడిపడి ఉన్న సంక్రాంతి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
