
(శ్రీరామ్ చక్రి న్యూస్) | నాదర్ గుల్ , జూన్ 11: అల్మాస్గూడ గ్రామ పరిధిలోని 57వ డివిజన్ నాదర్గుల్లో ఉన్న శ్రీ వేంకటేశ్వర కాలనీ (పాత 4వ వార్డు)లో సీసీ రోడ్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సాధారణ నిధుల నుంచి రూ.38 లక్షలు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ పూర్తికాగా, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులతో కలిసి కాలనీలో పర్యటించారు. మంజూరైన నిధులతో రెండు రోడ్ల నిర్మాణ పనులు పూర్తికానుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
కాలనీలో అంతర్గత రోడ్ల సమస్యను గత ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నవారు మల్లారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జి కీచన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్ఆర్) దృష్టికి తీసుకెళ్లగా, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం శంషాబాద్ జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు అంచనాలు రూపొందించి నిధులు మంజూరు చేశారు.కాలనీ అభివృద్ధికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, కేఎల్ఆర్, జోనల్ కమిషనర్ చంద్రకళ, బడంగ్పేట్ సర్కిల్ అధికారులకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దయాకర్రెడ్డి, రామునాయక్, శ్రీకాంత్రెడ్డి, వంశీధర్, జనార్దన్రెడ్డి, శ్రీనాథ్చారి, రమేష్బాబు, రవి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. :::
