లక్ష్మీదేవిపల్లి మండలలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఎర్రుపాలెంలో జామాయిల్ తోట, పెనుబల్లిలో మామిడితోట, అశ్వారావుపేటలో ఆయిల్పాం తోట దగ్ధమయ్యాయి. పినపాక మండలంలో రెండు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం అగ్నికీలలు వ్యాపించాయి. వేర్వేరుగా జరిగిన ఈ ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. జూలూరుపాడు మండలంలో అడవికి నిప్పంటుకుంది. సమీప రైతులకు తృటిలో ప్రమాదం తప్పింది. లక్ష్మీదేవిపల్లి మండలలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఎర్రుపాలెంలో జామాయిల్ తోట, పెనుబల్లిలో మామిడితోట, అశ్వారావుపేటలో ఆయిల్పాం తోట దగ్ధమయ్యాయి. పినపాక మండలంలో రెండు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
