పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ పోలీసుల కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణ ముగియడంతో కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.

ప్రత్యేక దర్యాప్తు అధికారి, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో బండి భగీరథ్ను పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. బుధవారం నాడు కోర్టు అనుమతితో పేట్బషీరాబాద్ పోలీసులు బండి సాయిభగీరథ్ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా నిందితుడిని జైలు నుంచి మేడ్చల్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించి, అక్కడ వైద్యపరీక్షలు జరిపించారు.
