నవ మాసాలు మోసి కన్న శిశువును పుట్టిన కొన్ని గంటల్లోనే ఆలయ ప్రాంగణంలో వదిలివేసిన కరశత్వం ఒక వైపు, తమ బిడ్డ కాకున్నా ఆ శిశువును అకున చేర్చుకుని ప్రాణాలు కాపాడి ఈ బిడ్డను నాకు ఇవ్వండి నేనే పెంచుకుంటా అంటూ ఓ తల్లి వేదన మరోవైపు మండల పరిధిలో చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా యాకరి సంగీత కన్నీళ్లతో మాట్లాడుతూ తమకు పిల్లలు లేరని, పిల్లలు లేని తమకు దేవుడే పాపను ఇచ్చాడని, చట్ట ప్రకారం దత్తత ఇప్పిస్తే శిశువును తానే పెంచుకుంటానని అధికారులను వేడుకున్నారు. పాపకు చికిత్స చేసేంతవరకూ అక్కడే ఉండి పాపను అప్పగించాలని ప్రాథేయపడ్డారు. దత్తత ప్రక్రియ చట్టబద్ధంగానే జరగాలని, అవసరమైన సహకారం అందిస్తామని అధికారులు ఆమెకు భరోసా ఇచ్చారు. శిశువును సకాలంలో గుర్తించి ప్రాణాలు కాపాడిన యాకరి సంగీత – పరమేష్ దంపతులు, ఆశా వరర్ బాలమణిని వైద్యులు అభినందించారు.
