రైతులను ఇబ్బంది పెట్టినా, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు.

ఎదులాపురం, మే 29 : రైతులను ఇబ్బంది పెట్టినా, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. శుక్రవారం ఆదిలాబాద్లోని కలెక్టరేట్లో జొన్నల కొనుగోళ్లు, రవాణా, గోదాముల నిర్వహణ, హమాలీల కేటాయింపులపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
