మన ఊరు- మన బడి బిల్లులు చెల్లించలేదని ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాల భవనానికి తాళం వేశాడు.

హైదరాబాద్ : మన ఊరు- మన బడి బిల్లులు చెల్లించలేదని ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాల భవనానికి తాళం వేశాడు.వివరాల్లోకి వెళ్తే..నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల భవనాన్ని సురేష్ అనే కాంట్రాక్టర్ భవనం నిర్మించి రెండేళ్లు గడుస్తున్నాయి. కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకు బిల్లులు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాఠశాల భవనానికి తాళం వేసి నిరసన తెలిపాడు.
