భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) బుధవారం ఖమ్మం రానున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లను సన్మానించేందుకు కేటీఆర్ ఖమ్మం వస్తున్నారు.

మాజీ మంత్రి, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ ఆధ్వర్యంలో వెయ్యి బైకులతో కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ ర్యాలీ చేపట్టి కేటీఆర్కు స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు అజయ్కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఖమ్మానికి వచ్చే నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులకు తెలంగాణ భవన్ వద్ద భోజన ఏర్పాట్లు చేశారు.
