తీవ్రవాద ప్రాంతాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మౌలిక వసతులు మెరుగు పర్చి ప్రజలకు భద్రత కల్పిస్తామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) బీ శివధర్రెడ్డి అన్నారు. తెలంగాణ-చత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం పామునూరు శివారులోని కర్రెగుట్టలను మంగళవారం ఆయన పరిశీలించారు.

వెంకటాపురం(నూగూరు), ఏప్రిల్7 : తీవ్రవాద ప్రాంతాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మౌలిక వసతులు మెరుగు పర్చి ప్రజలకు భద్రత కల్పిస్తామని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) బీ శివధర్రెడ్డి అన్నారు. తెలంగాణ-చత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం పామునూరు శివారులోని కర్రెగుట్టలను మంగళవారం ఆయన పరిశీలించారు. అటవీ శాఖ పీసీసీఎఫ్ సీహెచ్ సువర్ణ, అక్టోపస్, గ్రేహౌండ్స్ ఏడీజీపీ డాక్టర్ అనిల్కుమార్, సీఆర్పీఎఫ్ ఐజీపీ టీ విక్రమ్, ఎస్ఐబీ ఐజీపీ సుమతి, అటవీ శాఖ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ డాక్టర్ వీ ప్రభాకర్తో కలిసి డీజీపీ పర్యటించారు.
