ఎస్ జే సూర్య నటిస్తున్న ‘కిల్లర్’ సినిమా షూటింగ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్ సందర్భంగా కార్బన్ డయాక్సైడ్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

చెన్నై, జూన్ 3: ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య నటిస్తున్న ‘కిల్లర్’ సినిమా షూటింగ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్ సందర్భంగా కార్బన్ డయాక్సైడ్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని పెరంబూర్ బిన్నీ మిల్ ప్రాంగణంలో ‘కిల్లర్’ సినిమా షూటింగ్ జరుతోంది. బుధవారం ఉదయం ఊహించని విషాదం చోటుచేసుకుంది.
