పెబ్బేరుకు సమీపంలో జాతీ య రహదారి-44 పై సోమవారం ఓ ఆర్టీసీ బస్సు అదపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్టం మంత్రాలయం నుంచి తెల్లవారుజామున వనపర్తికి బయలు దేరింది.

పెబ్బేరు, జూన్ 29 : పెబ్బేరుకు సమీపంలో జాతీ య రహదారి-44 పై సోమవారం ఓ ఆర్టీసీ బస్సు అదపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆంధ్రప్రదేశ్ రాష్టం మంత్రాలయం నుంచి తెల్లవారుజామున వనపర్తికి బయలు దేరింది. బస్సు రంగాపురం గ్రామం దాటి పెబ్బేరుకు చేరుకొనే లోపే ప్రమాదానికి గురై డివైడర్పై అడ్డంగా పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 61 మంది ప్రయాణికులు కుదుపులకు గురై ఒకరిపై ఒకరు పడిపోయి గాయాలపాలయ్యారు.
