అప్పులు చేసి పంటలు పండిస్తే కొనేనాథుడు లేక వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులు అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పులు చేసి పంటలు పండిస్తే కొనేనాథుడు లేక వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులు అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన నుగూరే పాండురంగ్(48) అనే రైతు తాను పండించిన జొన్న పంటను విక్రయించేందుకు మే 23న తేదీన సిరికొండ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు.
