నిర్మల్ జిల్లాలో యాసంగికి సంబంధించిన మక్కలు, వరి, జొన్నల కొనుగోళ్లతోపాటు రవాణా ప్రక్రి య వేగవంతంగా కొనసాగుతున్నదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.

నిర్మల్, మే 30 : నిర్మల్ జిల్లాలో యాసంగికి సంబంధించిన మక్కలు, వరి, జొన్నల కొనుగోళ్లతోపాటు రవాణా ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శనివారం సాయంత్రం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొక్కజొన్న, వరి, జొన్నల కొనుగోలు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామన్నారు. మే 31 నాటికి 1.10 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. మే 30వ తేదీ నాటికే 1.61 లక్షల మెట్రిక్ టన్నుల మక్కల కొనుగోళ్లు పూర్తి చేసి రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
