నాగర్కర్నూల్ జిల్లా మరికల్ మండలం జిన్నారంలో ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు.

మరికల్, జనవరి 02 : నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారంలోని మన్యవాగు నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక తరలింపునకు శుక్రవారం తహసీల్దార్ రామకోటి ట్రాక్టర్లకు అనుమతులు ఇచ్చారు. ఇసుక తరలించేందుకు ట్రాక్టర్లు వెళ్లగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇక్కడ నుండి ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటుతాయని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు అనుమతిచ్చారని ఇసుకను తరలించేందుకు ప్రయత్నించగ అనుమతుల పత్రాన్ని గ్రామానికి చెందిన యువకుడు చించి వేశారు.
