రంగారెడ్డి జిల్లా:బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్బాలాపూర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి లకు స్వాగతం పలికారుఅనంతరం బాలాపూర్ గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలను సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో దీవించాలని గణనాథుని కోరుకున్నామని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ తీగల అనిత హరినాద్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.