బీబీనగర్ మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో జిల్లా గ్రామీణ సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలింగ్ అధికారులకు అవసరమైన ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా ఉన్న 34 గ్రామ పంచాయతీలలో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 30 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
