చైనా మాంజాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

హైదరాబాద్ : చైనా మాంజాపైపోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా మాంజా షాపుల్లో పోలీసులు విస్తృతంగా సోదాలు చేపట్టారు. 1.25 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర నుంచి చైనా మాంజాను తెప్పిస్తున్న పలువురు దుకాణాదారులను అరెస్ట్ చేశారు. చైనా మాంజాతో మనుషులకే కాకుండా పక్షి జాతికి సైతం ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం దానిని నిషేధించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా నిషేధిత మాంజాను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
