ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

అమరావతి, జూన్ 11: ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. ఈరోజు(గురువారం) తెల్లవారుజాము నుంచి సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున హవాలాతో పాటు, మనీలాండరింగ్ ద్వారా నిధులు మళ్లించినట్లు గుర్తించిన అధికారులు.. పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో హైదరాబాద్, నార్సింగి, మంచిరేవుల ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి.
