రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గన్నీ బ్యాగుల ఏర్పాటు చెయ్యడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 75 సార్లు ఢిల్లీ వెళ్ళేందుకు రేవంత్ రెడ్డికి సమయం ఉందిగాని రైతుల సమస్యల గురించి పట్టించుకునేందుకు రేవంత్ రెడ్డికి సమయం లేదని మండిపడ్డారు.
