స్వయంభూ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు విశేష పూజలు చేశారు.

తంగళ్లపల్లి, మే 31: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు విశేష పూజలు చేశారు. ప్రత్యేక అలంకరణ , స్వామివారి ఉత్సవ మూర్తులకు పల్లకిలో గిరిప్రదక్షిణ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పూజారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు ఉన్నారు.
