రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లే రైతుల గుండెలు ఆగిపోతున్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.

యాదాద్రి భువనగిరి : రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లే రైతుల గుండెలు ఆగిపోతున్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. గురువారం చౌటుప్పల్ మున్సిపల్ వ్యవసాయ మార్కెట్ను సందర్శించి ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి బాధ లేదన్నారు. కానీ, కాంగ్రెస్ పాలనలో యూరియా, రైతు బంధు, సాగు నీరు, చివరికి పండిన పంటను అమ్ముకోవాలన్నా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
