సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు ఇటీవల దిల్సుఖ్నగర్ కొత్తపేటలో నివసిస్తున్న తమ కుమార్తె వద్దకు వచ్చారు.

హైదరాబాద్, జనవరి 02: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్పై వెళ్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహేద్ నగర్లో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు ఇటీవల దిల్సుఖ్నగర్ కొత్తపేటలో నివసిస్తున్న తమ కుమార్తె వద్దకు వచ్చారు. గురువారం సాయంత్రం ట్యాంక్ బండ్ చూసేందుకు వారు బైక్పై బయలుదేరారు. మూసారాంబాగ్ హైటెక్స్ మోటర్స్ సమీపంలో.. వెనుక నుంచి వేగంగా వచ్చిన దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ ఆర్డినెరీ బస్సు.. వీరు ప్రయాణిస్తున్న బైక్ను ఢీకొట్టింది.
