దీపావళి తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి

శనివారం ట్రేడింగ్లో తులంపై రూ.1,250 పెరిగింది. దీంతో హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,620కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,150 పెరిగి రూ.1,15,150గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 25, 770కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 15, 300కి చేరుకుంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.1.70 లక్షల వద్ద కొనసాగుతోంది.
