మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారం చిట్యాల గ్రామానికి చేరుకొని పట్లోరి లలిత భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మెదక్ రూరల్, డిసెంబర్ 16 : మెదక్ మండలం చిట్యాల మాజీ సర్పంచ్ పట్లోరి వెంకటేశం తల్లి పట్లోరి లలిత సోమవారం అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం నాయకుల ద్వారా తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారం చిట్యాల గ్రామానికి చేరుకొని పట్లోరి లలిత భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
