
ఈ రోజు హయత్నగర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎల్.బి.నగర్ జోన్ డీసీపీ, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బందికి క్రింది ముఖ్య సూచనలు చేశారు.
డీసీపీ మాట్లాడుతూ:
దృఢమైన పోలీసింగ్ అనేది చట్ట అమలులో భయం లేకుండా, పక్షపాతం లేకుండా న్యాయంగా వ్యవహరించడం. శాంతి భద్రతలను కాపాడటానికి ప్రతి పోలీస్ అధికారి క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో పని చేయాలి,” అని పేర్కొన్నారు.
అలాగే, ప్రాథమిక పోలీసింగ్ బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఇందులో:
బీట్ పహారా
కనిపించే పోలీసింగ్
నిఘా
ఇంటెలిజెన్స్ సేకరణ
అత్యవసర స్పందన
నేర నివారణ
నేర గుర్తింపు
ప్రజా శాంతి భద్రత
సమాజంతో సత్సంబంధాలు
వంటి అంశాలపై ఫోకస్ చేయాలన్నారు.
అంతేగాక,స్నేహపూర్వక పోలీసింగ్ ద్వారా ప్రజలతో విశ్వాసాన్ని పెంచాలి.
వృత్తి నైపుణ్య పోలీసింగ్ ద్వారా సామర్థ్యం, క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతను ప్రతిబింబించాలి,” అని వివరించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నేరాల నివారణ, దర్యాప్తు మరియు పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు.
పోలీసింగ్ విజయాన్ని కేవలం నేర గణాంకాల ఆధారంగా కాకుండా, ప్రజల్లో నమ్మకం, విశ్వాసం, సంతృప్తి ఆధారంగా కొలవాలన్నారు. అలాగే, స్టేషన్ రికార్డులను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు.
చివరిగా, జోన్ పరిధిలోని అన్ని పోలీస్ అధికారులు, సిబ్బంది రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలి, ప్రజల భద్రతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని డీసీపీ పేర్కొన్నారు.
