తెలంగాణలో మూసీ నది 240 కిలోమీటర్లు ప్రవహిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవాహం ఉందన్నారు.

హైదరాబాద్, జనవరి 02: కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిదని విపక్ష పార్టీలోని పలువురు కీలక నేతలకు సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. శుక్రవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపులో ఉన్న విషం అత్యంత ప్రమాదకరమన్నారు. తాను వివరాలు చెబుతుంటే ఎందుకు విషం కక్కుతున్నారంటూ విపక్ష సభ్యులను ఆయన సూటిగా నిలదీశారు. ప్రజలకు నిజాలు తెలియవద్దని చర్చ జరగకుండా చూడాలనుకుంటున్నారా? అని వారిని ప్రశ్నించారు. వివరాలు చెబుతుంటే నొప్పి ఎందుకు మీకు అంటూ విపక్ష సభ్యులపై ఆయన మండిపడ్డారు.
